ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హీరో ఆర్య, ‘అనంతన్ కాడు’ చిత్ర బృందంపై కేసు

1 గంట క్రితం

Case filed against actor Arya and the ‘Ananthan Kaadu’ film team.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ప్రముఖ తమిళ సినీనటుడు ఆర్య, ‘అనంతన్ కాడు’ చిత్ర బృందంపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా చిత్రీకరణకు విలువైన కెమెరాలు తీసుకొని రూ.1.80 కోట్ల బకాయిలు చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని హైలాం కాలనీలోని తాహేర్ సినీ టెక్నిక్ సంస్థ‌కు అకౌంటెంట్ జావేద్ అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బకాయిల కోసం సంప్రదించిన తమ సంస్థ మేనేజర్ ను చిత్ర నిర్మాత వినోద్, హీరో ఆర్య, వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జావేద్ అలీ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


‘అనంతన్ కాడు’ సినిమా నిర్మాణ సమయంలో హీరో ఆర్య, నిర్మాత వినోద్, నిర్మాన సంస్థ ప్రతినిధులు పలుమార్లు తాహేర్ సినీ టెక్నిక్ సంస్థను సంప్రదించి సినిమా చిత్రీకరణ కోసం అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లు, ఇతర పరికరాలు అందించాలని కోరారు. అద్దె మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని పలుసార్లు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 25వ తేదీన ఒప్పందం కుదుర్చుకొని హైదరాబాద్ నుంచి కేరళకు విలువైన పరికరాలను సంస్థ సొంత ఖర్చులో తరలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా మొత్తం పూర్తయ్యే వరకు పరికరాలను వినియోగించుకున్నారు. కానీ, ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.2.12 కోట్లలో రూ.1.80 కోట్లకుపైగా బకాయిలుచెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకాయిలు ఉన్నట్లు లిఖితపూర్వకంగా అంగీకరించి, సినిమా విడుదలకు ముందే మొత్తం చెల్లించి ‘నో డ్యూస్‌ సర్టిఫికెట్‌’ తీసుకుంటామని హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేదనీ, బకాయిలు చెల్లించాలని పలు విధాలుగా సంప్రదించినా పట్టించుకోలేదని, దీనికితోడు కేరళలో కోర్టును ఆశ్రయించి వాస్తవాలను దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారని సంస్థ అకౌంటెంట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జావేద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్