ప్రజాశక్తి-తాడేపల్లి: వైసిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. సీదిరి అప్పలరాజు ఓ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అప్పలరాజుతో మాట్లాడి జగన్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, పార్టీ విధాలా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ను కలిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)