ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో విషాదం చోటు చేసుకుంది. వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ పాఠశాలలో విద్యార్థి ప్రణయ్ తేజ (6) మృతిచెందాడు. గురువారం ఉదయం స్కూలు కు వచ్చిన విద్యార్థి హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించారు. ఈ క్రమంలో చెంపపై కొట్టారు. కాసేపటికి విద్యార్ధి స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రణయ్ తేజ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై ప్రణయ్ తేజ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖలో విషాదం.. టీచర్ దెబ్బలకు విద్యార్థి మృతి...!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 05:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)