విజయవాడ : శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్టు ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇటీవల వైద్యులు ఆమెకు ఉదర శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్టు షర్మిల స్వయంగా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. త్వరగా కోలుకోవాలని కాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆత్మీయత, ప్రార్థనలు, మద్దతు తనకు కొండంత అండగా నిలిచాయని షర్మిల పేర్కొన్నారు.
శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నా : వైఎస్.షర్మిల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)