శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు అల్పపీడనం

16 గంటల క్రితం

Rains - Low-pressure area - Rains in the Telugu states..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి, ఆతదుపరి మూడునాలుగు రోజులలో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారంనాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 70.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్