ప్రజాశక్తి-ఏలూరు సిటీ : మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అకాల మరణం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న ఆయన, నాని పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా నాని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆళ్ల నాని మరణం ఏలూరు రాజకీయ, ప్రజా జీవితానికి తీరని లోటని పలువురు నేతలు పేర్కొన్నారు. నారా లోకేష్తో పాటు రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డా. నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు నాని పార్థివదేహానికి నివాళులర్పించారు.
అలాగే ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏపీ భవన నిర్మాణ, ఇతర నిర్మాణాలు కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ తదితరులు పాల్గొని ఆళ్ల నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.







కామెంట్లు (0)