ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ కారులో రూ.2 లక్షల నగదు

1 గంట క్రితం

acb.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 11:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- నెల్లూరు: జిల్లాలోని మూసునూరు టోల్‌ ప్లాజా వద్ద ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపి నాయక్‌ కారును తనిఖీ చేశారు. అక్రమంగా వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆయన వద్ద నుంచి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోపినాయక్ ను కస్టడిలోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్