ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పాండవాని జానపద గాయని తీజన్ బాయి కన్నుమూత

1 గంట క్రితం

Pandavani legend Teejan Bai dies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయ్‌పూర్‌ : ప్రఖ్యాత పాండవానీ జానపద కళాకారిణి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత తీజన్ బాయి (70) కన్నుమూశారు. గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు తెలిపారు. తీజన్ బాయి ఛత్తీస్‌గఢ్‌ సాంప్రదాయ కళను ప్రపంచ ప్రేక్ష‍కులకు పరిచయం చేశారు. మహాభారత గాథలను తనదైన శైలిలో గాత్రం, అభినయంతో ఆవిష్కరించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భారతీయ జానపద సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆమె విశేష కృషి చేశారు. కళా రంగంలో ఆమె చేసిన అమూల్యమైన సేవలకు గాను భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, 2019లో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో ఆమెను గౌరవించింది. ఆమె మరణంతో భారతీయ జానపద కళారంగంలో ఒక అధ్యాయం ముగిసినట్లయింది.

తీజన్ బాయి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్