ప్రజాశక్తి-చందర్లపాడు (ఎన్టిఆర్) : మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక తునికిపాటి కళ్యాణ మండపంలో సోమవారం కమ్యూనిస్టు యోధురాలు యార్లగడ్డ జోయ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ ... జోయ ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం ఉమ్మడి కృష్ణా జిల్లా సభ్యురాలుగా పనిచేసిన ఆమె పార్టీ నందిగామ డివిజన్ కార్యదర్శి గా బాధ్యత నిర్వహించారు అని చెప్పారు. మహిళా సంఘం, రైతు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. విజయ మిల్క్ డైరీ డైరెక్టర్ గా చందర్లపాడు పాల కేంద్రం డైరెక్టర్ గా బహుముఖ బాధ్యత నిర్వహించారని స్మరించుకున్నారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలుగా మహిళల హక్కులు, మానవత్వం గౌరవమైన జీవితం కోసం ఐదు దశాబ్దాల పాటు నిరంతరం పోరాడారని గుర్తు చేసుకున్నారు. అఖిల భారత కిసాన్ కమిటీ సభ్యురాలుగా రైతులు, వ్యవసాయ కార్మికులు సమస్యలపై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని వివరించారు. ముఖ్యంగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ఉత్పత్తిదారుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ సంక్షోభం పై ప్రభుత్వాలు దృష్టి సారించేలా అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేశారు అని తెలిపారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారని చెప్పారు. రాజకీయంగా ఎన్నో సమస్యలు వచ్చినా నిబద్దతతో నిలబడ్డారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమె జీవితాన్నే ప్రజా ఉద్యమాలు అంకితం చేశారని పలువురు నేతలు స్మరించుకుంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, ఎంబీవికె బాధ్యులు ఆర్ తులసీరావు, ప్రజాశక్తి ఎడిటర్ బి తులసిరావు, నందిగామ కమిటీ సభ్యులు కటారపు గోపాల్, చనుమోలు సైదులు, కుటుంబ సభ్యులు జోయ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు.
కామ్రేడ్ యార్లగడ్డ జోయ సంతాప సభ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 05:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)