అయోధ్య : ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయ తొలి సిఇఒ గా విశ్రాంత ఎయిర్మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. ఆయన 39 ఏళ్లపాటు వాయుసేనలో సేవలందించారు. సిఇఒ పోస్టు కోసం ఎంపిక కమిటీ 5,585 దరఖాస్తులను పరిశీలించింది. 16 మందిని ఇంటర్వ్యూ చేసింది. ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేసింది. అయోధ్య రామాలయంలో కానుకలు, విరాళాల చోరీపై ఆరోపణలు వెల్లువెత్తిన వేళ సిఇఒ నియామకం చేపట్టారు.
అయోధ్య రామాలయ తొలి సిఇఒ గా జితేంద్ర మిశ్ర
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు





కామెంట్లు (0)