* పేపర్ లీక్, బీఎస్ఎస్సీ పరీక్షల సమస్యలపై విద్యార్థుల ఆందోళన
పాట్నా : ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షా అవకతవకలు, ఉద్యోగ సమస్యలపై పాట్నా విద్యార్థులు గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వైపుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ మైదాన్ నుంచి రాజ్భవన్ వైపుగా మార్చ్ చేస్తున్న విద్యార్థులను బీహార్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల కవాతును అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్ ఉపయోగించారు. పేపర్ లీక్లు, వివిధ పరీక్షలలో అవకతవకలు మరియు ఉపాధి సంబంధిత సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు.
కాగా, బీహార్లో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని, అలాగే రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. "బీహార్లో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలన్నదే మా డిమాండ్ అని, రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న పరీక్ష పత్రాల లీకేజీల గురించి మేము ఆందోళన చెందుతున్నామని" వారు మీడియాతో చెబుతున్నారు.







కామెంట్లు (0)