గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకోల్‌‌కతాలో భారత్‌, ఉరుగ్వే ఫుట్‌‌బాల్‌ ‌మ్యాచ్‌

2 గంటల క్రితం

football
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 09:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌‌కతా: భారత పురుషుల ఫుట్‌‌బాల్‌ ‌జట్టు జట్టు మరో దిగ్గజ జట్టుతో స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడేందుకు రంగం సిద్ధమైంది. రెండుసార్లు ఫిఫా ప్రపంచ కప్ విజేత ఉరుగ్వే జట్టుతో అక్టోబర్ 6న కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగణంలో భారత్‌ ఫుట్‌‌బాల్‌ ‌జట్టు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడనుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌‌లో ఉరుగ్వే 20వ స్థానంలో ఉండగా.. భారత్‌ 138వ ర్యాంక్‌‌లో ఉంది. బెంగళూరులో సెప్టెంబర్ 26న పనామాతో జరిగిన మ్యాచ్ మరియు కోల్‌కతాలో అక్టోబర్ 3న ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్‌తోనూ భారత జట్టు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌‌లు ఆడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్‌కు ఈ విండోలో మూడవ అత్యున్నత స్థాయి అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. ఫిఫా విండోలో పనామా, బ్రెజిల్ మరియు ఉరుగ్వే మూడు ప్రపంచ కప్ ఆడే దేశాలతో భారతజట్టు తలపడనుంది. దీంతో కోల్‌కతాకు లా సెలెస్టే రాక భారత అభిమానులకు కనువిందు చేయనుంది. ఇక ఉరుగ్వే ప్రస్తుత ప్రధాన కోచ్, డియెగో ఫోర్లాన్, 2016లో ముంబై సిటీ ఎఫ్‌సి తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్