- పురుషుల 100మీ టి47లో స్వర్ణం, రజతం కైవసం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. పురుషుల 100మీటర్ల టి47ఫైనల్లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకం, మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్ రజత పతకం గెలుచుకుని భారత్కు చారిత్రాత్మక 1, 2స్థానాలను అందించారు. గావిత్ 10.71సెకన్లలో రేసును పూర్తి చేసి గేమ్స్ రికార్డుతో పాటు ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. మరో భారత అథ్లెట్ బాసిల్ 10.83సెకన్లలో రేసును ముగించి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ శాంటోస్ 10.85సెకన్ల సమయంతో కాంస్య పతకం సాధించాడు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ఇది మూడో స్వర్ణ పతకం. అంతకుముందు మహిళల 48కేజీల వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను, మహిళల షాట్పుట్ F57పారా అథ్లెటిక్స్లో షర్మిలా ధంకర్ స్వర్ణ పతకాలు గెలిచారు. పురుషుల 100మీటర్ల T47ఈవెంట్లో ఒక చేతికి సంబంధించిన శారీరక లోపం లేదా కదలికలో పరిమితి ఉన్న పారా అథ్లెట్లు పోటీపడతారు.







కామెంట్లు (0)