సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు నాలుగో పతకం

1 గంట క్రితం

common
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 08:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వెయిట్‌లిఫ్టింగ్‌లో రాజా ముత్తుపాండికి రజతం

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల 65 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రాజా ముత్తుపాండి అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ గేమ్స్‌లో భారత్ మొత్తం నాలుగు పతకాలు సాధించగా, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇది మూడో పతకం కావడం విశేషం.

ఫైనల్‌లో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీలు ఎత్తి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ విభాగంలో మలేషియాకు చెందిన అస్నిల్ బిదిన్ మొత్తం 299 కేజీలు ఎత్తి కొత్త గేమ్స్ రికార్డు నెలకొల్పుతూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పాపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

ఇప్పటికే భారత్ తరఫున మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం, పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించారు. రాజా ముత్తుపాండి రజతంతో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్