అమరావతి : ఎపి ఎప్సెట్ ఫలితాలు (AP EAPCET 2026 Results) బుధవారం విడుదలయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఎపి విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 2,76,572మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,545 మంది హాజరయ్యారు. వీరిలో 1,82,317మంది (70.52%) క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929మంది హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) క్వాలిఫై అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ లింక్ పై క్లిక్ చేసి ఎప్ సెట్ ఇంజినీరింగ్ ఫలితాలు చూడవచ్చు.
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
ఈ కింది లింక్ పై క్లిక్ చేసి AP EAPCET result 2026 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
టాప్ 10 ర్యాంకర్లు వీరే ..
ఇంజినీరింగ్ స్ట్రీమ్లో టాపర్లు..
జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి - గుంటూరు జిల్లా
కోరుకొండ శ్రావ్య - శ్రీకాకుళం
వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి - పల్నాడు
తుంగ దుర్గా సుప్రభాత్ - పల్నాడు
తెల్లూరి శ్రేయస్ రెడ్డి - హైదరాబాద్
ముక్కార సాకేత్ - వైఎస్ఆర్ కడప
బండి వెంకట సాత్విక్ - గుంటూరు
నూర్ బాషా హఫీజ్ - గుంటూరు
పసల మోహిత్ - కడప
మరక వంశీధర్ రెడ్డి - వైఎస్ఆర్ కడప
అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్లో టాపర్లు ....
శంబంగి జశ్వంత్ నాయుడు - విజయనగరం
కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి - మేడ్చల్ మల్కాజ్గిరి
కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య - కృష్ణా
కర్రి సత్యనారాయణ - కాకినాడ
బంటు ధాత్రిక - అనకాపల్లి
పల్లికొండ దర్శ్తేజ - కాకినాడ
వల్లెపు ధీరజ్ కృష్ణ - గుంటూరు
దండమూడి జాగృతి - గుంటూరు
ఆళ్ల శ్రీలక్ష్మి సత్యసాయి నిఖితారెడ్డి - పల్నాడు
రేలంగి జయ షణ్ముఖి - విజయనగరం







కామెంట్లు (0)