ఎస్విఆర్ శ్రీనివాస్ రాజీనామా ఆమోదం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎజిఐసిఎల్) మేనేజింగ్ డైరక్టర్గా ఎపిసిఆర్డిఏ అదనపు కమిషనర్ అభిషేక్ కుమార్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఈ మేరకు పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకూ ఎమ్డిగా ఉన్న శొంఠి వెంకటరత్న శ్రీనివాస్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది.







కామెంట్లు (0)