mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్లను వేధించడానికే ఎస్‌ఐఆర్‌‌ను ఉపయోగిస్తున్నారు : అఖిలేష్ యాదవ్‌

21 గంటల క్రితం

Akhilesh Yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రయాగ్‌‌రాజ్‌ : ఓటర్లను వేధించడానికే సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ‌ప్రక్రియను బిజెపి ఉపయోగిస్తోందని సమాజ్‌‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సోమవారం ఆరోపించారు. వచ్చే ఏడాది రాన్ను అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు.

కాగా, సమాజ్‌‌వాది పార్టీ ఎస్‌ఐఆర్‌‌పై పోరాటం చేస్తోంది అని అఖిలేష్‌ ‌అన్నారు. అసెంబ్లీ ఎన్నికలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన లోక్‌‌సభ ఎన్నికల్లో మేము వారిని ఓడించాము. ఈ అంశాలన్నింటినీ మేము ప్రజల ముందుకు తీసుకెళ్లి.. మరోసారి ఓడించడానికి ప్రయత్నిస్తాం అని ఆయన అన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టకుండా నిరోధించడానికే వారు ఎస్ఐఆర్ (SIR)ను ప్రవేశపెడతారు. అయితే చివరికి ఓటర్లే ​​వారిని ఓడిస్తారు. ఓటర్లను నిరంతరం వేధించడానికే ఎస్ఐఆర్ (SIR)ను ఉపయోగిస్తారు అని అఖిలేష్‌ అన్నారు. సవరణ ప్రక్రియలో తలెత్తిన సమస్యల కారణంగా ప్రజలు తమ పౌరసత్వానికి సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఐఆర్‌లో వారి పేర్లు లేవన్న ఒక్క కారణంతో, అత్యంత ప్రముఖులు సైతం తమ పౌరసత్వంపై ప్రశ్నలను ఎదుర్కొంటున్నారని నేను విన్నాను. ఈ అధికారిక చిక్కుముడిలో మనం ఎంత లోతుగా చిక్కుకుపోతున్నామో ఒక్కసారి ఊహించుకోండి అని అఖిలేష్‌ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్