మహాబలిపురం (తమిళనాడు) : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాడు. అన్నాడిఎంకెకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం తమిళ వెట్రి కజగం (టివికె)లోకి చేరారు. వీరందరూ గురువారం మహాబలిపురంలోని ఓ ప్రయివేటు హోటల్లో టివికె కండువా కప్పకున్నారు.
కాగా, టివికె చేరిన అన్నాడిఎంకె మాజీ మంత్రులు సి విజయభాస్కర్, ఎం ఆర్ విజయభాస్కర్, ఎంఎస్ఎం ఆనందన్, వలర్మతిలు ఉన్నారు. వీరే కాదు దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, పలు జిల్లాల కార్యదర్శులు కూడా టివికెలో చేరారు.








కామెంట్లు (0)