న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ రంగంలో మరో సరికొత్త స్టార్ దూసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ జాతీయ స్థాయిలో సంచలన ప్రదర్శనతో సరికొత్త రికార్డులను సృష్టించాడు. ప్రతిష్టాత్మక నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో సోమవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో రోహిత్ అద్భుత ఫామ్ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పోటీల్లో రోహిత్ యాదవ్ ఏకంగా 87.05 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ అద్భుతమైన త్రోతో ప్రస్తుత 2026 ఏడాదిలో ఆసియా ఖండంలోనే ‘రెండో అత్యుత్తమ త్రో’ నమోదు చేసిన క్రీడాకారుడిగా రోహిత్ నిలిచాడు. భారత జావెలిన్ త్రో చరిత్రలో ఇప్పటివరకు 87 మీటర్ల మార్కును దాటడం అరుదు. అయితే తాజా ప్రదర్శనతో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, ప్రముఖ అథ్లెట్ కిశోర్ జెనాల తర్వాత 87 మీటర్ల మైలురాయిని అధిగమించిన మూడో భారతీయ ప్లేయర్గా రోహిత్ యాదవ్ నిలిచాడు.
Print Editionజావెలిన్ త్రోలో రోహిత్ సంచలనం
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)