ప్రజాశక్తి - విజయవాడ : రాజధాని అమరావతిలోని ఉండవల్లి గ్రామంలో నేడు వైసీపీ నేతలు, పోలీసులపై జరిగిన భౌతిక దాడులను సిపిఎం ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, వైసిపి నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరిపై రాజకీయంగా ఎదుర్కోవచ్చునని తెలిపారు. కానీ భౌతిక దాడులకు పాల్పడటం సమంజసం కాదని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షం చేసిన దాడులను వ్యతిరేకించిన తెలుగుదేశం, నేడు అదే పద్ధతిలో భౌతిక దాడులను సమర్దించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి, టిడిపి నాయకత్వం ఇలాంటి భౌతిక దాడులను అరికట్టకపోతే శాంతిభద్రతలు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఈ దాడిని ప్రజాతంత్రవాదులు ఖండించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది .
ఉండవల్లి ఘటనపై సిపిఎం ఖండన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 06:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)