ప్రజాశక్తి - విజయవాడ : వియత్నాంలో బోటు ప్రమాద ఘటనలో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారు. ఇందులో మరణించినవారికి సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మృతి చెందిన 15 మంది టూరిస్టుల్లో మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారని తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఒక ప్రయివేటు కంపెనీ విహారయాత్రకు తీసుకెళ్ళిన సందర్భంగా పూక్వాక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. మృతి చెందినవారి పూర్తి వివరాలు రావలసి ఉందని పేర్కొన్నారు. మృతి చెందిన వారి భౌతికకాయాలు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సిపిఎం కోరింది.
వియత్నాం బోటు ప్రమాద మృతులకు సిపిఎం సంతాపం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 06:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)