విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యలో ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఎంబీబీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.18,150కి పెరిగింది. బీ కేటగిరీ ఫీజు రూ.14,52,000 కి పెరిగింది. సీ కేటగిరీ రూ.43.56 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బీడీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.15,730 కి పెరిగింది. బీ కేటగిరీ రూ.4,84,000 కి పెరిగింది. సీ కేటగిరీ రూ.14,52,000కి పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎపి లో ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు పెంపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)