గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డేటా సెంటర్ తో విశాఖ వినాశనం

1 గంట క్రితం

viskaha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 12:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రజల మనోభావాలను గౌరవించి రద్దు చేయాలి

- డేటా సెంటర్ తో పెరగనున్న తాగునీటి సమస్య

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

- సింహాచలం దేవస్థానం భూముల రక్షణపై ఎందుకు మాట్లాడ్డంలేదు

- బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్ పికి శ్రీనివాసరావు సూటి ప్రశ్న

ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : "విశాఖపట్నాన్ని వినాశనం చేసి, అదానీపట్నం చేయొద్దు. గూగుల్ డేటా సెంటర్ అనుమతులు రద్దు చేయాలి. మూడేళ్ల క్రితం మధురవాడలో అదానికి కేటాయించిన 300 ఎకరాలు వినియోగంలోకి తేకుండానే, ముదనర్లోవలో సింహాచలం దేవస్థానం భూమి 160 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఆరిలోన ప్రజల దాహార్తిని తీర్చకుండా, గోదావరి నీటిని ఆదానీ, గూగుల్ డేటా సెంటర్కు కట్టబెడుతుంది. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను గౌరవించకుండా పనులు చేపడితే పనులను ప్రజలు అడ్డుకుంటారు" అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, సిపిఎం జిల్లా కార్యదర్శి యం జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, ఆల్కెఎస్వి కుమార్, పి మణి, వి కృష్ణారావు, జగన్ తో కలిసి ఆయన గురువారం ముడసర్లోవ జలాశయం, ముడసర్లోవ డేటా సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముడసర్లోవ, తర్లువాడ, రాంబిల్లిలో డేటా సెంటర్ పెట్టి విశాఖను ల్యాండ్ మైన్గా మార్చేస్తున్నారని విమర్శించారు. ముడసర్లోవ రిజర్వాయర్ ఎండిపోవడంతో ఆరిలోప ప్రజలకు తాగునీరు సరఫరా చేసే ఆలోచన ప్రభుత్వం చేయకుండా, అదానికి పోలవరం నీటిని ఎలా ఇవ్వాలని ఆలోచించడం దుర్మార్గమన్నారు.

అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించి మంత్రి లోకేష్ మాట్లాడం అసెంబ్లీని నేరమన్నారు. అదానీ చెప్పిన అబద్ధపు మాటలు ప్రజలకు చెప్పడం తప్ప ప్రభుత్వం వద్ద డేటా సెంటర్కు సంబంధించిన నిపుణుల నివేదిక, ప్రాజెక్టు నివేదిక ఏదీ లేదన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిన ప్రతిచోటకు గోదారి నీరిస్తామని చెప్పి, చివరకు ప్రజలందరినీ మోసంచేసి అదానీ డేటా సెంటర్కు నీరు ఇసుర్తన్నారని అన్నారు. నివాసిత ప్రాంతం ముడసర్లోవలో డేటా సెంటర్ ఎంత మాత్రం మంచిదికాదన్నారు. అదానీ డేటా సెంటర్ విశాఖ ప్రజలను ముంచేయడానికి తప్ప ఉద్దరించడానికి రాలేదన్నారు. చంద్రబాబునాయుడు 3.5 టిఎంసిల నీరు డేటా సెంటర్కు అవసరమని చెబితే, మంత్రి లోకేష్ 3 టిఎంసిల నీరు సరిపోతాయని చెబుతున్నారని అన్నారు.

డేటా సెంటర్ల నష్టంపై అసెంబ్లీలో మాట్లాడిన నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి నోరు మూయించి ప్రజలను తప్పుతోవ పట్టించేలా లోకేష్ మాట్లాడారని అన్నారు. ప్రభుత్వానికి యూనిట్ విద్యుత్ను రూ.9, 10లకు అమ్ముకుంటున్న ఆదానికి, ప్రభుత్వం యూనిట్ రూపాయికి సరఫరా చేయడం అన్యాయమన్నారు. సింహాచలం దేవస్థానం భూములను అదానికి అప్పనంగా అప్పగించిన ప్రభుత్వం, పంచగ్రామాల భూ సమస్యను 40 ఏళ్లయినా పరిష్కరించకుండా ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. సింహాచలం దేవస్థానం భూములను ఆడానికి అప్పగిస్తుంటే బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్పీలు నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు. మత కల్లోలాలు రెచ్చగొట్టడం తప్ప దేవస్థానం అస్తులు కాపాడరా? కార్పొరేట్లకు కైంకర్యం చేస్తుంటే ఏమి చేస్తున్నారు? అని అన్నారు. రుషికొండను బోడిగుండు చేస్తున్నారని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పుడు మూడు బోడిగుండ్లు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరగకపోతే ఎందుకు లోపలకు అనుమతించడంలేదని నిలదీశారు. విశాఖ ప్రజల వినాశానికి వచ్చే డేటా సెంటర్ను ఢిల్లీ, బీహార్, జార్ఖండ్లో తరహాలో ఆంధ్రప్రదేశ్ యువతరం తిప్పికొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేంద్రకుమార్, పి. శంకరరావు, కుమారి, వి రాజు, భూలోక రావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్