ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ను జైలు నుండి ఆస్పత్రికి తరలించాల్సిందిగా సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించినట్లు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 48గంటల్లోగా ఆయనను షిఫా అంతర్జాతీయ ఆస్పత్రికి తరలించాలని, సెప్టెంబర్ 16 వరకు అక్కడే చికిత్స అందించాల్సిందిగా ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు గత కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు కేసుల్లో దోషిగా నిర్థారించడంతో ఆయన 2023 ఆగస్టు నుండి జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిచూపు గణనీయంగా క్షీణించిందని ఆయన లాయర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు నిర్నయాన్ని స్వాగతిస్తున్నామని పిటిఐ ప్రతినిధి జుల్ఫీకర్ బుఖారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కంటిచూపు, ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఈ నిర్ణయం వెలువడిందని ఆశిస్తున్నామని తెలిపారు.








కామెంట్లు (0)