శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తుపై పోటీ చేయనున్న మమతా బెనర్జీ

1 గంట క్రితం

mamata
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో నాయకత్వ వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) రెండు వర్గాలకు కొత్త పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులను కేటాయించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తును కేటాయించింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో అక్టోబర్‌ 6న జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో మమతా వర్గం ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గుర్తుపై పోటీ చేయనుంది. రిటబత్ర బెనర్జీ నేతృత్వంలోని మరో వర్గానికి ‘డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరును, ‘కవరు (ఎన్వలప్‌)’ గుర్తును ఈసీ కేటాయించింది. పార్టీ నాయకత్వ వివాదం పరిష్కారమయ్యే వరకు ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, ‘పువ్వులు-గడ్డి’ గుర్తును రెండు వర్గాలూ ఉపయోగించకూడదని ఈసీ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండు వర్గాలకు ప్రత్యామ్నాయ పేర్లు, గుర్తులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్