బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Stock Markets - ఐటీ, మెటల్ షేర్ల జోరుతో మార్కెట్ ర్యాలీ ..!

5 గంటల క్రితం

Market rallies, driven by the surge in IT and metal stocks!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెన్సెక్స్ 889 పాయింట్లు, నిఫ్టీ 265 పాయింట్లు లాభం


ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉత్సాహంగా ముగిశాయి. ఐటి, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు ఒక శాతం మేర లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 888.68 పాయింట్లు (1.16 శాతం) ఎగసి 76,654.60 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 264.85 పాయింట్లు (1.10 శాతం) పెరిగి 24,250.20 వద్ద స్థిరపడింది.


రోజంతా ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 77,765.49 పాయింట్ల గరిష్ట స్థాయిని, 77,333.24 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. విస్తృత మార్కెట్‌లోనూ సానుకూల ధోరణి కొనసాగింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 50.16 పాయింట్లు, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 102.92 పాయింట్లు పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ సూచీ 2.32 శాతం, నిఫ్టీ రియాల్టీ సూచీ 2.31 శాతం చొప్పున లాభపడగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీలు కూడా బలమైన ప్రదర్శన కనబరిచాయి. సెన్సెక్స్‌లోని హిందుస్తాన్ యునిలీవర్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ట్రెంట్, లార్సెన్ అండ్ టర్బో షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. వీటిలో హిందుస్తాన్ యునిలీవర్ షేరు అత్యధికంగా 4.70 శాతం ఎగిసింది. మరోవైపు అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎంఅండ్‌ఎం, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ షేరు అత్యధికంగా 3.19 శాతం పడిపోయింది.


సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 25 షేర్లు లాభాల్లో ముగియగా, ఐదు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ-50లో 38 షేర్లు లాభపడగా, 12 షేర్లు నష్టాలను నమోదు చేశాయి. విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.11 శాతం బలపడి 95.62 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 87.65 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4,031.84 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్