శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తల్లికి వందనం డబ్బులు కోసం భార్యను చంపిన భర్త

1 గంట క్రితం

Husband kills wife for money
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 10:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : తల్లికి వందనం డబ్బు కోసం భార్యను చంపిన ఘటన శుక్రవారం అన్నమయ్య జిల్లాలో జరిగింది. అన్నమయ్య జిల్లా పి.టి.ఎం (మం) రాపూరివాండ్లపల్లిలో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. తల్లికి వందనం డబ్బు కోసం భార్య పద్మావతి (30) గొంతుకోసి భర్త సురేష్ (37) చంపాడు. రాపూరివారిపల్లి పంచాయితి కొత్తపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. తల్లికి వందనం డబ్బు ఇవ్వలేదనే కోపంతో భర్త సురేష్ అతిగా మద్యం సేవించి భార్య పద్మావతి తో వాగ్వాదం చేసుకొని ఆపై హత్య చేశాడు. గతంలో కూడా తమ కుమార్తెను సురేష్ చిత్రహింసలకు గురిచేసాడని చివరికి కడతేర్చాడని పద్మావతి తల్లి కళావతి, తండ్రి రామన్నలు కన్నీటిపర్యంతమయ్యారు. హత్యకు గురైన పద్మావతికి ఇద్దరు కుమారులున్నారు. ప్రణీత్ 5వ తరగతి, విష్ణు 3వ తరగతి చదువుతున్నారు. పెద్దతిప్పసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్