గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈవీఎం గోదాంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి తనిఖీ

29 జూన్, 2026

District Election Officer and Collector Keerthi Chekuri inspects EVM warehouse.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సోమవారం రాజమహేంద్రవరంలోని ఎఫ్‌సీఐ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం (EVM) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పుటేజ్, రికార్డులను పరిశీలించి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా అమలులో ఉన్నాయని నిర్ధారించారు. ఈ తనిఖీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు టీడీపీకి చెందిన సలాది ఆనంద్, బిజెపి కి చెందిన బి. రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. శివరాముడు, అర్బన్ తహసీల్దార్ యు. రంజిత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్