సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పండుగ రోజు విషాదం - ప్రైవేట్ ట్రావెల్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

24 నిమిషాల క్రితం

Tragedy on a festival day – Two killed after being hit by a private travel bus.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పండుగ రోజు విషాద ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్‌ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు వెళుతుండగా, చెక్‌పోస్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కందుకూరు వెళుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్‌ కు చెందిన బస్సు రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్