ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : వినాయక చవితిని పురస్కరించుకుని నరసాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ మోహన్ అద్భుత కళాఖండాన్ని రూపొందించారు. కేవలం 2 గంటల్లో పెన్సిల్ లెడ్పై వినాయకుడి ప్రతిమను చెక్కారు. అతి చిన్న మునపై గణనాథుడి రూపాన్ని స్పష్టంగా తీర్చిదిద్దిన ఆయన ప్రతిభను స్థానికులు, పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ సూక్ష్మ వినాయకుడి కళాఖండం సోషల్ మీడియాలోనూ ఆకట్టుకుంటోంది.








కామెంట్లు (0)