ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : జల్లికొమ్మర హైస్కూల్ కి జూపల్లి ట్రస్టు తరుపున శనివారం స్టిక్ బుక్కు సి ఇ ఒ జూపల్లి అనిల్ కుమార్ మండల ఎస్ టి యు ఆధ్వర్యంలో లక్ష రూపాయాలు విలువ గల ల్యాప్టాఫ్ ను స్టికిబుక్కు సి ఇ ఒ అనిల్ కుమార్ తండ్రి జూపల్లి వీరబద్రరావు చేతుల మీదుగా అందచేసారు. ఈ సందర్భంగా వీరబద్రరావు ను హైస్కూలు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి కురెళ్ళ వెంకటరత్నం గ్రామ పెద్దలు కవల కోదండ రాంబాబు ఎస్ టి యు స్టేట్ కౌన్సిలర్ పుప్పాల ప్రకాష్ పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.
జల్లికొమ్మర హైస్కూల్ కి ల్యాప్టాప్ అందచేత
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)