సినీ నటి అనన్యరాజ్ జూలై 15న నిద్రలోనే చనిపోయినట్లు దాదాపు నెల రోజుల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గత ఏడాది కాలంగా ఆమె తీవ్ర శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ‘తన అనారోగ్య సమస్యలపై ఆమె పోరాడింది. రాణిలా జీవించింది.’అని కుటుంబ సభ్యులు ఆ ప్రకటనలో తెలిపారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. కాగా, అనన్య ‘7 అవర్స్ టు గో’ (2016), ‘ది ఫైనల్ ఎగ్జిట్’ (2017), ‘ఘోస్ట్’ (2019) వంటి హిందీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 2022లో వచ్చిన ‘తగ్గేదే లే’ సినిమాలో హీరో నవీన్ చంద్రకు జోడీగా నటించారు. ‘మద్రాసీ గ్యాంగ్’ అనే త్రిభాషా (తమిళ, తెలుగు, హిందీ) చిత్రంతో పాటు మరో సినిమా పూర్తి కావాల్సి ఉండగా, ఆమె మృతి చెందారు. అనన్య మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
నటి అనన్య మృతి
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)