విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతంలో 1992లో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ తాజాగా విడుదలైంది. శ్రీవిష్ణు కథానాయకుడిగా, మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జానకిరాం మారెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్లో కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూనే గ్రామీణ వాతావరణం, అప్పటి సామాజిక పరిస్థితులు, పాత్రల మధ్య సంఘర్షణ, వినోదభరిత సన్నివేశాలను చూపించారు. యాక్షన్, హాస్యం, భావోద్వేగాలు కలగలిసిన కథగా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ రిలీజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 07:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)