సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కాంగోలో ఎబోలా విజృంభణ

1 గంట క్రితం

ebola
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 09:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 1,405కు చేరిన మృతుల సంఖ్య

- 3,200 దాటిన కేసులు

బున్యా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 3,200 మందికి పైగా ఎబోలా సోకగా, 1,405 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 15న తూర్పు కాంగోలో ప్రారంభమైన ఈ వ్యాప్తి, ఇటీవలి కాలంలో నమోదైన అత్యంత తీవ్రమైన ఎబోలా ఉద్ధృతుల్లో ఒకటిగా మారింది. ఆరోగ్య అధికారుల ప్రకారం, ఈ వ్యాప్తికి కారణమైన బుండిబుగ్యో వైరస్‌కు ఇప్పటివరకు ఆమోదిత వ్యాక్సిన్ లేదా సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. అడవి జంతువుల నుంచి మనుషులకు సోకే ఈ వైరస్, అనంతరం బాధితుల శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాపిస్తోంది.

తూర్పు కాంగోలో తిరుగుబాటు గ్రూపుల దాడులు, భద్రతా సమస్యలు వ్యాధి నియంత్రణ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. రక్షణ బృందాలు అనేక ప్రాంతాలకు చేరుకోలేకపోతుండగా, ఆరోగ్య కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతోంది.

ఎబోలాపై ఉన్న మూఢనమ్మకాలు, తప్పుడు ప్రచారం కారణంగా ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ పలువురు ఉద్యోగులు విధులు వీడడం కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఇప్పటివరకు 36 మంది ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా బారినపడి మరణించినట్లు సమాచారం. ఈ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం కేసుల మూలాన్ని గుర్తించలేకపోతున్నట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రభుత్వం నివారణ చర్యలను ముమ్మరం చేస్తున్నప్పటికీ, వైరస్ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించడం ఇప్పటికీ సవాలుగానే మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్