గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌పై మరోసారి యుద్ధ హెచ్చరికలు చేసిన ట్రంప్

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 07:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉద్రిక్తతలు పెంచుతున్న వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేస్తూ సైనిక దాడి హెచ్చరికలు చేశారు. ఈజిప్టులోని డమియెట్టా నౌకాశ్రయం సమీపంలో అమెరికా సంబంధిత ఇంధన సదుపాయాలపై జరిగిన దాడి అనంతరం స్పందించిన ట్రంప్, "ఇప్పుడు మా వంతు వచ్చింది. ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన దాడి చేస్తాం" అని అన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్, ఇరాన్ "తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ పరిస్థితులను మరింత తీవ్రతరం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈజిప్టులో జరిగిన దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. దాడిలో రెండు సహజ వాయువు ట్యాంకర్లు అగ్నికి ఆహుతయ్యాయని, అమెరికాకు చెందిన తేలియాడే ఇంధన నిల్వ కేంద్రం మరియు గ్రీకు ట్యాంకర్ దెబ్బతిన్నాయని ఈజిప్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఈజిప్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్