ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో ఘనంగా మొట్టమొదటి జోనల్ మహాసభ

17 జులై, 2026

First Zonal Conference Held Grandly in Visakhapatnam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ : ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA),సౌత్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో మొట్టమొదటి జోనల్ మహాసభ (Maiden Zonal Conference) శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం, దాబాగార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రైల్వే లోకో రన్నింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రత, పని గంటలు, సిబ్బంది కొరత, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, తదితర కీలక అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు.

01

ప్రధాన డిమాండ్లు ....

సైన్-ఆన్ నుండి సైన్-ఆఫ్ వరకు విధి గంటలను 8 గంటలకు పరిమితం చేయాలి.

36 గంటల్లోపు హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి చేరేలా విధానాన్ని అమలు చేయాలి.

వారానికి రెండు రాత్రులకే నిరంతర నైట్ డ్యూటీలను పరిమితం చేయాలి.

46 గంటల వారాంత విశ్రాంతి (30+16 గంటలు) కల్పించాలి.

రన్నింగ్ అలవెన్స్‌ను RAC-1980 సూత్రాల ప్రకారం సవరించాలి.

పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలి.

నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించాలి.

ALP, LP(G), LP(S), LP(P), LP(M) తదితర ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి.

ఈ మహాసభకు AILRSA జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కె.సి. జేమ్స్, జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ ఆర్.ఆర్. భగత్, మాజీ ఎమ్మెల్సీ కామ్రేడ్ ఎం.వి.ఎస్. శర్మతో పాటు పలువురు ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరై ప్రసంగించారు.

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్