న్యూఢిల్లీ : 1984నాటి సిక్కు అల్లర్ల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపి సజ్జన్ కుమార్ (80) గురువారం మరణించారు. వైద్య చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతికి గల కారణాలను వైద్యులు నిర్థారించాల్సి వుంది.
మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన సజ్జన్ కుమార్ 1984 నాటి సిక్కు అల్లర్ల కేసులో ప్రధాన వ్యక్తిగా నిలిచారు. మూడు దశాబ్దాలకు పైగా ఆ హింసాకాండకు సంబంధించిన పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు.







కామెంట్లు (0)