నలుగురు నాగా పౌరుల మృతి
గౌహతి : డబుల్ ఇంజన్ సర్కారు ఏలుబడిలోని మణిపూర్లో మారణహోమం ఆగడం లేదు. సాయుధులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కాంగ్పోక్పి జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కుకీలు అధికంగా ఉండే కాంగ్పోక్పి జిల్లాలోని మకుయ్ అషాంగ్ నుంచి నాగాలు అధికంగా ఉండే సేనాపతి జిల్లాకు ప్రయాణిస్తున్న ఆరుగురిపై సాయుధులు కాల్పులు జరిపారు. మృతులను టాడ్సాంగ్బో రింగ్కాంగ్మై, మారియాక్డిబో విజునామై, అనిల్ విజునామై, విసోబో చరెనామైగా స్థానికులు గుర్తించారు.








కామెంట్లు (0)