త్రిసూర్ :కేరళంలోని త్రిసూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అగ్నిమాపక-రక్షణ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన కారుకు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా చెబుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 06:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)