- వీడియో వైరల్
- ప్రశంసల వెల్లువ
న్యూఢిల్లీ: ఢిల్లీ నిరసనలో యువత ధైర్యంగా నిలబడిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జాతీయ జెండాను పట్టుకొని ముందుకు వెళ్తున్న యువకుడిని ఓ పోలీస్ అధికారి ఎత్తి కింద పడేశాడు. ఆ యువకుడు పైకి లేచి జాతీయ జెండాను పైకి ఎత్తి ముందుకు నడిచాడు. దీంతో మరో అధికారి లాఠీఛార్జ్ చేశారు. అయినా ఆ యువకుడు ముందుకే అడుగు వేశాడు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ధైర్యంగా నిలిచిన ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రముఖ కార్టూనిస్టు సతీష్ ఆచార్య తన ఎక్స్ ఖాతాలో "త్రివర్ణ పతాకం ధరించిన ఈయనే నిజమైన దేశభక్తుడు, నిజమైన హీరో" అంటూ పోస్టు చేశారు. ఈ ఘటన విస్తృతంగా వైరల్ అవుతుంది. పోస్టులో కనిపిస్తున్న వ్యక్తి జాతీయ జెండాను చేతబట్టి నిలబడిన దృశ్యం పలువురి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు ఆయన ధైర్యాన్ని, దేశభక్తిని కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.







కామెంట్లు (0)