బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇపిఎఫ్‌ఒ వేతన పరిమితి పెంపుకు కేబినెట్‌ ఆమోదం : అశ్వినీ వైష్ణవ్‌

59 నిమిషాల క్రితం

epfo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 05:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఇపిఎఫ్‌ఒ) వేతన పరిమితిని నెలకు రూ.25,000కు పెంచేందుకు కేబినెట్‌ ఆమోదించినట్లు కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌ బుధవారం తెలిపారు. గతంలో రూ.15,000గా ఉండే వేతన పరిమితిని రూ.25,000కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్ష‍ల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి ఇపిఎఫ్‌ఒ పరిధిలోకి వస్తారని తెలిపారు. ఈ నిర్ణయం ప్రావిడెంట్ ఫండ్ పొదుపులు, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఇపిఎస్‌) కింద పెన్షన్ భద్రత, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఇడిఎల్‌ఐ) కింద బీమా రక్షణను పొందే అవకాశాలను కూడా విస్తృతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సుమారు ₹10,250 కోట్ల వార్షిక బడ్జెట్ మద్దతుతో పోలిస్తే, ప్రభుత్వానికి అదనంగా రూ.11,339 కోట్ల వార్షిక వ్యయం అవుతుందని అన్నారు. కొత్త వేతన పరిమితి ప్రకారం, ఇపిఎస్‌కు ఉద్యోగులు, యజమానులు వేసే చందాలు కూడా పెరుగుతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్