- వాయుగుండంగా మారే అవకాశం
- ఉత్తరాంధ్రకు వాతావరణ హెచ్చరిక
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో మంగళవారం వరకు గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. సోమవారం (ఆగస్టు 17) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.







కామెంట్లు (0)