మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చింతూరు ఐటీడీఏ వద్ద ఆదివాసుల రాస్తారోకో..

17 గంటల క్రితం

rasta roko
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చింతూరు : రంపచోడవరంలో నిర్వహించనున్న ఆదివాసి మహాగర్జన కార్యక్రమానికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకోవడంతో చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో చేరుకున్న ఆదివాసీలు నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దాదాపు గంటసేపు ఈ ఆందోళన కొనసాగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం జిల్లా ఎస్పీ హేమంత్ కుమార్, ఐటీడీఏ పీవో శుభం లోక్‌పాల్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా ముగియడంతో రంపచోడవరంలో జరిగే ఆదివాసి మహాగర్జన బహిరంగ సభకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆదివాసీలు తమ ఆందోళనను విరమించి మహాగర్జన కార్యక్రమానికి బయలుదేరారు.

rasta roko 2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్