ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఎఐతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఆరోపణపై టిడిపి నాయకుడు మద్దిరాల మ్యాని శుక్రవారం మంగళగిరి డిజిపి కార్యాలయంలో అంబటిపై ఫిర్యాదు చేశారు. మ్యానీ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కేసు నమోదు చేసి ఎఐ వీడియో పోస్టు వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. అంబటి అనుచరులు పెమ్మసాని చేతులకు బేడిలు వేసినట్టు ఎఐ వీడియో రూపొందించి పోస్టింగ్ చేసినట్టు టిడిపి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు కూడా అంబటిపై ఎస్పికి ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి అంబటి పై సిఐడి కేసు
31 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)