ప్రజాశక్తి-తిరుపతి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ప్రసంగిస్తుండగా ఆయనకు కళ్లు తిరిగి స్పృహ తప్పినట్లుగా అయ్యారు. దీంతో కిందపడిపోకుండా సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకున్నారు. అనంతరం వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అస్వస్థత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)