శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన మంత్రి లోకేష్ సౌత్ కొరియా పర్యటన

1 గంట క్రితం

Minister Lokesh's South Korea visit concludes.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి లోకేష్ చేపట్టిన వారం రోజుల సౌత్ కొరియా పర్యటన ముగిసింది. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన ఈ పర్యటనలో మంత్రి లోకేష్, ఆయన బృందం పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా .... మంత్రి లోకేష్ 50కి పైగా కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడిదారులకు మరింత చేరువయ్యేందుకు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కొరియాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్‌లో మంత్రి లోకేష్ ‘అపెక్స్-కొరియా' (ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌టర్నల్ ఎంగేజ్‌మెంట్-కొరియా) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పర్యటన ప్రారంభంలో సియోల్‌లోని భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో భేటీ అయిన లోకేష్, కొరియాలోని కీలక పరిశ్రమలను ఎపి కి తీసుకురావడంలో చొరవ చూపాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్