31 మందితో రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : డివైఎఫ్ఐ రాష్ట్ర నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎంవి రమణ (నెల్లూరు), కార్యదర్శిగా జి.రామన్న (కర్నూలు) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలోగల డాక్టర్ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలోని (గోను చలపతి, చెంచయ్య నగర్ ) కె.పెంచలయ్య ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగిన డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభ గురువారం ముగిసింది. 31 మందిని రాష్ట్ర కమిటీకి ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎస్ కె అబ్దుల్లా (కర్నూలు), సహాయ కార్యదర్శిగా కాసాపురం రమేష్ (అనంతపురం), వై.శిరీష (కర్నూలు), ఉపాధ్యక్షులుగా వి.శివకుమార్ (వైఎస్ఆర్ కడప), కె.బాబు (ప్రకాశం) యుఎస్ఎన్.రాజు (విశాఖపట్నం) ఎన్నికయ్యారు.







కామెంట్లు (0)