ప్రజాశక్తి-శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 43,580 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 4,600 క్యూసెక్కుల ఔట్ఫ్లో కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.60 అడుగుల నీటిమట్టం నమోదైంది. శ్రీశైలం కుడి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు జలాశయంలోని నీటిమట్టం, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 08:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)