శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నోటీసులు ఓటర్లకు చేరేదెప్పుడు ?

5 రోజుల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 53.85 శాతం ఇంకా పెండింగ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా నోటీసుల జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ నెల 16వ తేదీ నాటికి జనరేట్‌ చేసిన 44,13,864 నోటీసుల్లో కేవలం 20,37,099 (46.15 శాతం) మాత్రమే ఓటర్లకు చేరాయి. మరో 23,76,765 (53.85 శాతం) నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో అత్యధికంగా 91.56 శాతం నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. విశాఖలో 86.97 శాతం, శ్రీసత్యసాయిలో 83.75 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. నోటీసులు సకాలంలో అందకపోతే ఓటర్లు తమ వివరాలపై అభ్యంతరాలు, అవసరమైన పత్రాలు సమర్పించుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్