సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ ప్రాజెక్టు: హైడ్రా మిషన్‌ తొక్కి కార్మికుడు మృతి

1 గంట క్రితం

posa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 08:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దోర్నాల: వెలిగొండ ప్రాజెక్టులో విషాదం చోటుచేసుకుంది. రెండో సొరంగ మార్గంలో హైడ్రా మిషన్ తొక్కి వ్యక్తి కార్మికుడు చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు మోతిలాల్‌ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రెండో టన్నెల్‌లో 12 కిలోమీటర్ల సమీపంలో బోరింగ్‌ మిషన్‌ వద్ద మోతిలాల్‌ విధులు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర రావడంతో హైడ్రా మిషన్‌ వెనుక కూర్చొని నిద్రపోయాడు. ఇది గమనించని డ్రైవర్‌ హైడ్రా మిషన్‌ను వెనక్కి నడపడంతో మోతిలాల్‌పై నుంచి మిషన్‌ వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోతిలాల్‌ను ప్రాజెక్టు అంబులెన్స్‌లో దోర్నాల వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటరమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్